5Oct 2018
రానున్న శాసనసభ ఎన్నికల్లో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో మంత్రి శ్రీ కేటీఆర్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సన్నాహక సమావేశానికి సహచర మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ జి. వివేకానంద, కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ శ్రీమతి తుల ఉమ తదితరులు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు.