రాజన్న సిరిసిల్ల జిల్లా, సర్దాపూర్లో వ్యవసాయ కళాశాలకు మంత్రులు శ్రీ కేటి రామారావు మరియు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటుచేసిన రైతు భీమా పథకంపై అవగాహనా సదస్సులో మంత్రి కేటిఆర్ ప్రసంగించారు.రాష్ట్రంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే సీఎం కేసీఆర్ కల అని మంత్రి ఉద్ఘాటించారు.సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కాలంతో పరుగులు పెడుతున్నాయని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.