Minister KT Rama Rao inaugurated the newly constructed underpass at Chintalkunta Checkpost

2May 2018

ఎల్బీనగర్ నియోజకవర్గం, చింతలకుంట చౌరస్తా వద్ద నిర్మించిన అండర్‌పాస్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. రూ. 18.70కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అండర్‌పాస్‌తో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గనున్నాయి. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా అందుబాటులోకొచ్చిన ప్రాజెక్టులో ఇది మూడవది.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మల్లారెడ్డి, నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.