Minister KTR inaugurated the newly constructed Government Degree College in Gambhiraopet mandal, Rajanna Sircilla District. Planning Commission Vice Chairman Sri Vinod Kumar Boianapalli, MLC Sri Naradasu Laxman Rao, District Collector Krishna Bhaskar were present.
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండల కేంద్రంలో రూ. 2.25 కోట్లతో నిర్మించిన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గంభీరావుపేటలో కేజీ టూ పీజీ ఒకే ఆవరణలో ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్యత తనది అని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థినుల కోసం హాస్టల్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అత్యధికంగా 940 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ విద్యార్థికి సన్నబియ్యంతో భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు జ్యోతిబా ఫులే, అంబేడ్కర్ ఓవర్సీస్ కింద ఫీజు రియింబర్స్మెంట్ ఇస్తున్నామని తెలిపారు. సినారే పేరు మీద ఏర్పాటు చేసిన లైబ్రరీ పోటీ పరీక్షలకు వేదికగా మారిందన్నారు.