16Feb 2022
Minister KTR laying foundation stone for Siddapur reservoir works
తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించే సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్, శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ హన్మంత్ షిండే, శ్రీ గంప గోవర్ధన్, శ్రీ జాజల సురేందర్, శ్రీ గణేష్ బిగాల, శ్రీ మొహమ్మద్ షకీల్ అమీర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.