రాజేంద్రనగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఇవాళ మంత్రి శ్రీ కేటీఆర్ రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలోని అత్తాపూర్, మైలార్దేవ్పల్లిలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అత్తాపూర్ డివిజన్ సిక్చావునిలో రూ.1.53 కోట్ల తో నిర్మించే సీసీరోడ్డు, బీటీ రోడ్డు, రూ.9.42 కోట్లతో మీరాలం నుంచి హిమాయత్సాగర్ రోడ్డుకు, రూ.4.70 కోట్లతో చేపట్టే మల్కంచెరువు అభివృద్ధి పనులకు, రాజేంద్రనగర్ సర్కిల్లో రూ.16.31 కోట్లతో నిర్మించే బీటీరోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.6.25 కోట్లతో నిర్మించిన కిస్మత్పూర్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీ మహేందర్రెడ్డి, శాసన మండలి చైర్మన్ శ్రీ స్వామిగౌడ్ , ఎంపీ శ్రీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ప్రకాశ్ గౌడ్తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.