తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

1Nov 2020

– బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయింది
– బీజేపీ దుబ్బాకలో ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారీ ఎత్తున డబ్బు పట్టుబడుతోంది
– ఈరోజు కోటి రూపాయలు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు
– గోబెల్స్ కి పాఠాలు చెప్పే మాదిరి సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన విషప్రచారాన్ని, దుష్ప్రచారం, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు
– ఇలాంటి వాటన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు
– ఎల్లుండి ఎన్నిక కనుక ఈ రోజు చివరి కుట్రకు బీజేపీ తెర లేపుతోంది
– బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నాన్ని అవకాశంగా మలుచుకుని, బిజెపి కుటిల ప్రయత్నాలు చేస్తోందని సమాచారం ఉంది
– హైదరాబాదులో డిజిపి కార్యాలయం లేదా ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో తమ చివరి కుటిల ప్రయత్నానికి తెరలేపి తద్వారా హైదరాబాద్ లో లాఠీఛార్జ్, లేదా పోలీసు కాల్పులు జరిగేలా బీజేపీ కుట్రలు పన్నుతోంది
– రేపు బీజేపీ హైదరాబాద్ లో లాఠీచార్జి, పోలీసుకాల్పులు జరిగే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కుట్ర చేస్తుందనీ, ఈ మేరకు మాకు బిజెపి పార్టీలోని నాయకులే మాకు సమాచారం అందించారు. ఇలాంటి సమాచారాన్ని రూడీ చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరుతున్నాం
– ఈ మేరకు బీజేపీ కుట్రల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్షన్ కమిషనర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర డిజిపి కి మా పార్టీ ప్రతినిధుల బృందం కలుస్తుంది
– నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏ పార్టీ ప్రయత్నించిన ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డిజిపిని టిఆర్ఎస్ పార్టీ కోరుతుంది
– ఇంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్న బిజెపి అబద్ధాలు, అసత్యాలు డ్రామాలు, డబ్బులు, అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలు గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను
– బీజేపీ లాంటి కుటిల రాజకీయ పార్టి పట్ల దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను